మద్యం మత్తులో యువకులు మహిళా భర్తను బెదిరించి..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: పాల్వంచలో ఓ మహిళపై ముగ్గురు యువకులు అఘాయిత్యానికి ప్రయత్నించారు. మద్యం మత్తులో ఉన్న ముగ్గురు మహిళా భర్తను బెదిరించి భార్యను తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. అయితే భర్త కేకలు వేయడంతో వారు పరారయ్యారు. అప్పటికే బాధితురాలు 100 నెంబర్కు ఫోన్ చేయడంతో పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. గత రాత్రి హైదరాబాద్ నుంచి పాల్వంచకు చేరుకున్న దంపతులు బస్టాండ్ నుంచి ఇంటికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది.
పాల్వంచలో జులాయిల ఆగడాలు ఎక్కువయ్యాయని బాధితురాలు వాపోయింది. రాత్రి సమయంలో గస్తీ లేకపోవడంతో కొందరు యువకులు మద్యం మత్తులో రోడ్లపై వెళ్లే మహిళలను వేధిస్తున్నట్లు స్థానికులు సయితం తెలిపారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు, సీసీ పుటేజీ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. పలు సెక్షన్లకింద కేసు నమోదు చేశారు